Tuesday, May 7, 2024

Breaking | మాజీ ఎమ్మెల్యే కుంజా స‌త్య‌వ‌తి ఇక లేరు.. ఆకస్మిక మృతి!

భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి ఇక లేరు. ఆదివారం అర్ధరాత్రి (ఒంటి గంట సమయంలో) భద్రాచలంలోని త‌న నివాసంలో తీవ్రమైన ఛాతి నొప్పితో బాధ‌ప‌డుతుంటే హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందినట్టు సమాచారం.

కుంజ సత్యవతి 2009లో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం అభ్యర్ధిగా గెలుపొందారు. రానున్న ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా ఆమె పోటీలో నిల‌బ‌డ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ప్రస్తుతం ఆమె రాష్ట్ర కార్యదర్శగా ఉన్నారు. సీపీఎంలో ప్రస్థానాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన ఆమె హఠాత్తుగా మృతి చెందడంపై పట్టణ వాసులు దిగ్భ్రాంతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement