Wednesday, May 1, 2024

TS: రామ మందిరం వ్యతిరేకించిన వారిని బహిష్కరించండి…బండి సంజ‌య్‌

రామ మందిరం వ్యతిరేకించిన వారిని బహిష్కరించండ‌ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజ‌య్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కమార్ పాదయాత్ర నిర్వహించారు.

ఈ స‌ద‌ర్భంగా ఆయ‌న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించినోళ్లను, అయోధ్య అక్షింతలపై రాజకీయం చేసేటోళ్లను బహిష్కరించండని పిలుపునిచ్చారు. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు ఆని టిక్కెట్ కోసం ఎన్టీఆర్ వద్దకు పోయి కేటీఆర్ అని కె సి ఆర్ మార్చిండన్నారు. కట్టె కాలేవరకు కేసీఆర్ తెలంగాణను దోచుకుంటూనే ఉంటారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను అమలు చేయకుండా దాటవేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అన్నారు. అవగాహనతోనఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారని అన్నారు. క్రిష్ణా, కాళేశ్వరంపై విచారణ జరపాలి. దోషులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement