Tuesday, May 7, 2024

TS: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందన్నారు. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం అభినందనీయమన్నారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందన్నారు. భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటన్నారు. UNA భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతు దొరుకుతుందన్నారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదన్నారు. కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్పది, అభినందనీయమన్నారు.

ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించడం అభినందనీయమన్నారు. చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న అవార్డు గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలన్నారు. చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం, గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమన్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలన్నారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానన్నారు. రాష్ట్రపతి పోచంపల్లి పర్యటన సందర్భంగా రాష్ట్రపతికి మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రిత్వ శాఖ సెక్రటరీ రచన సాహు, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టి పోలు విజయలక్ష్మి లు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement