Sunday, April 28, 2024

TS : నేడు డీఎస్సీ నోటిఫికేషన్‌.. 11,062 టీచర్‌ పోస్టులు..

రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవాళ విడుదలకానున్నది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది.

పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి, కొత్త పోస్టులను కలుపుకొని నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులున్నాయి. అదనంగా 4,957 టీచర్‌ పోస్టులు, మరో 1,016 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement