Wednesday, May 1, 2024

అత్యాచార యత్నం చేసిన వ్యక్తికోసమా ధర్నా.. ఈటలపై జీవీ రామకృష్ణ ఫైర్..

మైనారిటీ మహిళ పై అత్యాచార య‌త్నానికి పాల్పడి నాలుగు సెక్ష‌న్ల క్రింద అరెస్ట్ అయిన నాయకున్ని కాపాడేందుకు ధర్నా చేయడం సిగ్గు చేటు అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా చేసిన ఈటల ముందు మహిళ లోకానికి క్షమాపణ చెప్పి, ముక్కు భూమికి రాయాలన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పి చైర్ ప‌ర్సన్ కనుమల విజయ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement