Thursday, May 16, 2024

TS: బాసర ఆలయానికి పోటెత్తిన భక్తజనం…చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాసాలు…

నిర్మల్ ప్రతినిధి, ఫిబ్రవరి 14(ప్ర‌భ‌ న్యూస్): బాస‌ర ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. వ‌సంత పంచ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో అమ్మ‌వారి స‌న్నిధిలో చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాసాలు చేయించేందుకు భ‌క్త‌జ‌నం బారులు తీరారు. అమ్మ‌వారికి ద‌ర్శ‌నానికి దాదాపు4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

- Advertisement -

వసంత పంచమి పురస్కరించుకొని బుధవారం వేకువ జాము నుంచి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమాలను చేస్తున్నారు. అదేవిధంగా బాసర ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు అమ్మవారి ప్రత్యేక పూజలతో ఇవాళ తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. చదువుల తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తరలి వచ్చారు.


ఇందు కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూడు గంటల నుంచి అక్షర శ్రీకార పూజలను అర్చకులు ప్రారంభించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాసర సరస్వతీ ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఆలయ గోపురాలు, తదితర ప్రాంతాల్లోనూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అయితే, అక్షరాభ్యస క్రతువుకు సుమారు 6 గంటల సమయం, అమ్మవారి దర్శనం కోసం 3 గంటల సమయం పడుతోంది.
ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక పూజలు …
వసంత పంచమి మహోత్సవ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి అభిషేక సేవలో శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఆయ‌న‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement