Monday, April 29, 2024

ధాన్యం కొనడంలో జాప్యం.. రైతుల రాస్తా రోకో .. మంత్రి కొప్పుల హామీ

పెద్దపల్లి రూరల్, (ప్రభ న్యూస్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంని నిరసిస్తూ పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామస్థులు రాస్తా రోకో నిర్వహించారు. పెద్దపల్లి – మంథని రహదారిపై బైఠాయించి ధ‌ర్నా చేశారు. అటువైపు వెళుతున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, పిన్నింటి రాజు రాస్తారోకోలో పాల్గొని మద్దతు తెలిపారు.దాంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పెద్దపల్లి, బసంత్ నగర్ ఎస్సైలు మహేందర్, వెంకటేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ ద్వారా హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement