Sunday, April 28, 2024

TS : లారీని ఢీకొట్టిన ఆటో ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

సూర్యాపేట, ప్రభ న్యూస్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో లారీని ఆటో ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. చికిత్స పొందుతూ నిన్న జూనియర్ లెక్చరర్ లావణ్య మృతి చెందగా ఈ తెల్లవారుజమున హైదరాబాద్ ఆరెంజ్ హాస్పిటల్ మోక్షజ్ఞ (7) మృతి చెందారు.

ఇద్దరూ చిన్నారులతో తల్లి సంధ్య‌ ఆటోలో ప్రయాణిస్తుండగా ఘటన ప్రదేశంలో 17నెలల చిన్నారి వేదస్విని మృతి చెందింది. ఒకే కుటుంబంలో ఇద్దరూ చిన్నారులు మృతి చెందడంతో వారి స్వగ్రామం నాగారం మండలం పసునూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement