Friday, May 3, 2024

CM REVANTH: దావోస్ టూ లండ‌న్‌..మూడు రోజుల పాటు లండన్‌లోనే రేవంత్‌

సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్‌లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement