Friday, May 3, 2024

Crime – రూ.15 ల‌క్ష‌ల విలువైన గంజాయి సీజ్ – ఇద్ద‌రు అరెస్ట్

నాగోల్ సెప్టెంబరు 02 (ప్రభ న్యూస్) – గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్వోటి, పోచంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.15 లక్షల విలువ చేసే 70 కిలోల గంజాయిని సీజ్ చేశారు. రాచకొండ కమిషనర్ డీఎస్. చౌహాన్, ఎస్వోటి డీసీపీ మురళీధర్ తో కలిసి ఎల్బీనగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు.

పక్కా సమాచారంతో…
పక్కాగా అందిన సమాచారం మేరకు శనివారం తెల్లవారుఝామున జూలూరు క్రాస్ రోడ్డు వద్ద మాటు వేసిన ఎల్బీనగర్ ఎస్వోటి అధికారులు, పోచంపల్లి పోలీసులు ముంబై నివాసి దేవ్ రాజ్ పవార్, పూణే నివాసి సచిన్ సుభాష్ షిండేలను అరెస్ట్ చేసి వారి నుంచి 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. విచారణలో వైజాగ్ లోని
అరకు ప్రాంతం నుంచి కిలో 8 వేల రూపాయలకు కొన్నట్టు తెలిసింది. గంజాయి అమ్మిన వ్యక్తితో వాహనాన్ని సమకూర్చుకొని జూలూరు క్రాస్ రోడ్డు వద్ద దిగినట్టు వెళ్లడైంది. తమ నుంచి గంజాయి కొనే వ్యక్తి కారు పంపిస్తా అని చెప్పిన నేపథ్యంలో ఈ ఇద్దరు అక్కడ ఎదురు చూస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు గంజాయిని ముంబైలో కిలో 20 వేల రూపాయలకు అమ్ముతున్నట్టు విచారణలో వెళ్లడైంది.
మాదక ద్రవ్యాలను వినియోగించిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ హెచ్చరించారు. ఎవరైన మాదక ద్రవ్యాలు వాడిన ,రవాణా చేసిన 100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement