Friday, May 3, 2024

Congress – అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ , కేటీఆర్ నెంబర్ వన్ – కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

మక్తల్, నవంబర్26(ప్రభన్యూస్) – దేశంలో అబద్దాలు మాట్లాడడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ నెంబర్ వన్ అని అంతటి అబద్ధాలు మరెవరు మాట్లాడారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు .కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు .గత ప్రభుత్వం ఆరు గంటలు కరెంటు ఇస్తుంటే తాము అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంటు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 167 వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి వాకిటి శ్రీహరికి మద్దతుగా జరిగిన రోడ్ షోలో కర్ణాటక మంత్రి బోసరాజు తో కలిసి ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య పాల్గొన్నారు

.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్మి నీ బొమ్మిని చేయడంలో కేసీఆర్ దిట్ట అన్నారు. కర్ణాటకలో కరెంటు కష్టాలంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుష్ప్రచారం చేస్తూ బదనాం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు .గతంలో ఇచ్చే ఆరు గంటల కరెంటు నుండి నేడు 24 గంటల కరెంటు అందిస్తున్నామని చెప్పారు. ధైర్యం ఉంటే కర్ణాటక కు వచ్చి చూసుకోవాలని ఆయన కేసీఆర్ కేటీఆర్ లకు సవాల్ విసిరారు . కాంగ్రెస్ బిజెపి మోసపూరిత వాగ్దానాలను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మక్తల్ లో బలహీన వర్గాలకు చెందిన వాకిటి శ్రీహరిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ,జి.గోపాల్ రెడ్డి,ప్రశాంత్ కుమార్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ,నాగరాజుగౌడ్, కొత్తకోట సిద్ధార్థ రెడ్డి ,జి. రవికుమార్ యాదవ్, జి .లక్ష్మారెడ్డి,మాన్వి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement