Sunday, April 28, 2024

Congress – ఖమ్మం ఎంపీ టికెట్‌ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని దరఖాస్తు

హైదరాబాద్‌: ఖమ్మం ఎంపీ టికెట్‌ కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేశారు. అనంతరం గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఖమ్మం నుంచి సోనియాగాంధీ లేదా ప్రియాంకను పోటీ చేయాలని కోరామన్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. వారు పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. దాదాపు 20 ఏళ్లుగా ఖమ్మం ప్రజలతో కలిసి పనిచేస్తున్నామని, వారి ఒత్తిడి మేరకే ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement