Sunday, April 28, 2024

TS : మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న

లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌చారంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా అభ్య‌ర్థుల గెలుపు కోసం ప్ర‌చారంతో పాటు నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో కూడా పాల్గొంటున్నారు. కాగా, ఇవాళ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయా అభ్య‌ర్థులకు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారం చేయ‌నున్నారు.

- Advertisement -

ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆత్రం సుగుణ , జీవన్ రెడ్డి , సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమాలకు రేవంత్ హాజరు కానున్నారు. భారీ ర్యాలీతో తరలి వెళ్లి ఈ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు.
ఇవాళ ఉదయం ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సభ, మధ్యాహ్నం నిజామాబాద్‌లో, సాయంత్రం మల్కాజ్‌గిరిల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement