Sunday, April 28, 2024

CM REVANTH మాజీ ప్ర‌ధాని పీవీ కీర్తిని పెంచేలా ప‌నిచేస్తాం..

పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పీవీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని సీఎం పేర్కొన్నారు.

పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమ‌ని, పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌ల‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని పేర్కొన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement