Sunday, April 28, 2024

TS: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనిపై కేసు నమోదు..

కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. బీఎస్పీ నేత ఎర్ర కామేష్ ఈసీకి కూనంనేనిపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆధారాలు అధికారులకు అందజేశారు. ఈ ఫిర్యాదుతో పాల్వంచ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఆదేశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదులో ఎంపీడీవో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మీటింగ్ పెట్టారని ఆరోపించారు. దీంతో కూనంనేనిపై 188, 171-సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement