Sunday, April 28, 2024

TS : కారు భీభ‌త్సం…భారీగా ట్రాఫిక్ జాం…

చింతలకుంట చెక్‌పోస్ట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి అతివేగంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో విద్యుత్ స్తంభం రోడ్డుపై పడిపోవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్థంభించింది.

ఆంధ్రాకు వెళ్లే ఏకైక అతిపెద్ద జాతీయ రహదారి కావడంతో ముఖ్యంగా చింతల కుంట వద్ద ఆంధ్రాకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి అక్కడే బస్ స్టాప్ ఉండటంతో పరిస్థితి కష్టతరంగా మారింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ స్తంభాన్ని పునరుద్ధరించే పనిలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement