Saturday, May 25, 2024

యండమూరి వీరేంద్రనాథ్‌ కారుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్‌ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును గోదావరిఖని డిపో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతిని, టైరు పగిలిపోయింది. కారులో ప్రయాణిస్తున్న యండమూరి, డ్రైవర్‌.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. యండమూరి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement