Friday, May 3, 2024

అనారోగ్యం…క్షణికావేశం… బీటెక్ విద్యార్థి ఆత్మహత్య….

శంకరపల్లి (ప్రభ న్యూస్)- అనారోగ్య కారణాలతో నవ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకరపల్లి మండల పరిధిలో జరిగింది.. మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన 20 ఏళ్ల కడకంచి హరికృష్ణ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు ..చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలకు క్షణికావేశంలో సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు, తర చావుకు ఎవరూ కారణం కాదని ఆ యువకుడు ఉత్తరం రాసిపెట్టి మరి చనిపోయాడు. కుటుంబ సభ్యులు స్థానికులు అందించిన సమాచారం మేరకు శంకరపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement