Saturday, May 4, 2024

BSP – వ‌రంగ‌ల్ తూర్పు నుంచి బ‌రిలో ట్రాన్స్ జెండ‌ర్ … బిఎస్పీత‌రుపున పోటీ..

హైదరాబాద్‌: ఎన్నిక‌ల‌లో తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండ‌ర్ పోటీ చేయ‌నున్నారు. వరంగల్‌ తూర్పు నుంచి చిత్రపు పుష్ప తలయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బరిలోకి దింపింది బిఎస్పీ.. కాగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. 43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కలి్పంచారు.. ఈ నెల 3న 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా 43 మందితో కూడిన రెండో విడత జాబితాతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 63కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement