Saturday, May 4, 2024

ADB: బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం.. మంత్రి కేటీఆర్

ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 4 (ప్రభ న్యూస్) : బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యం కావాలని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సమక్షంలో అసిఫాబాద్ కు చెందిన పీసీసీ సభ్యురాలు మార్స్ కోలా సరస్వతి, ఉట్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుర్క బాపు రావు, కోట్నక్ రమేష్, పెందుర్ ప్రభాకర్, తుడుండెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్యతో పాటు సుమారు 200 మంది కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లో ఉదయం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మీ, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆసిఫాబాద్ జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement