Thursday, May 9, 2024

BRS Party – కెసిఆర్ స‌మ‌క్షంలో బిఆర్ఎస్ లో చేరిన నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి, విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేశారు. నేడు కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లోజ‌రిగిన కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వీరితో పాటు వీరి అనుచరులకు గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసారి పాలమూరులో 14కి 14 సీట్లు గెలిచేందుకు నాగం జనార్ధన్ రెడ్డి కృషి చేయాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉండి.. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం కోసం ప్రయత్నించాలని తెలిపారు సీఎం కేసీఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement