Sunday, April 28, 2024

సాయి చంద్ కుటుంబ సభ్యులకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – ఇటీవల మృతి చెందిన ఉద్యమ గాయకుడు సాయిచంద్ కుటుంబ సభ్యులకు భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా అమరచింతలో సాయిచంద్ తండ్రి కి 25 లక్షల రూపాయలు, సోదరికి 25 లక్షల రూపాయల చెక్కులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సాయిచంద్ కుటుంబ సభ్యులకు చెక్కులను అందించామన్నారు. ఇప్పటికే సాయి సతీమణి రజనికి గిడ్డంగుల శాఖ చైర్మన్ పదవి ఇచ్చిన‌ విషయం వివిధమే. హైదరాబాదులో సాయి చంద్ ఇద్దరు పిల్లలకు తలా 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement