Monday, April 29, 2024

TS: విద్యార్థులకు అల్పాహారం మంచి పరిణామం.. మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్, అక్టోబర్ 6 ( ప్రభ న్యూస్): విద్యార్థులకు అల్పాహారం మంచి పరిణామమని రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల శివారెడ్డిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో అల్పాహార పథకాన్ని మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.

ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పాఠశాలలో అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్, మండల పరిషత్ అధ్యక్షురాలు చంద్రకళ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి బాబు సింగ్, నాయకులు వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement