Thursday, May 2, 2024

బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి…గవర్నర్ దత్తాత్రేయ

బోనాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇవాళ బండారు దత్తాత్రేయ సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం లాల్ దర్వాజ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ బోనాల ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని వివరించారు.

దేశ సంస్కృతి ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ప్రధాని మోదీ అనేక కార్యకమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాలకు అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకోవాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement