Thursday, May 16, 2024

Boath – అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మూడు లక్షలు సీజ్…

బోథ్ అక్టోబర్ 27 ప్రభ న్యూస్ – అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఘన్ పూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మూడు ల‌క్ష‌ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు ఎస్. ఎస్. టి. మహారాష్ట్రలోని మహోర్ నుండి హదరాబాద్ కు వెళ్తున్న ఇన్నోవా ఎం.హెచ్ 26 బి.హెచ్ 6000 నంబర్ గల వాహనాన్ని ఎస్ వో టి పోలీసులు తనిఖీ చేయగా ఎటువంటి రుజువులు లేనీ 3 లక్షల ను గుర్తించారు. వాటిని చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సీజ్ చేసి బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఈ త‌నిఖీల‌లో సూపరింటెండెంట్ రఘువీర్ రెడ్డి , స్థానిక పోలీసులు బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement