Tuesday, April 30, 2024

KTR : ప‌నిచేసే నాయ‌కుడిని దీవించాలి…మంత్రి కేటీఆర్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మొయినాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల గురించి మీకు బాగా తెలుసని, రెండుసార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉందన్నారు.

రైతుబీమా పెట్టి ధీమాగా ఉండేలా కేసీఆర్ చేశారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నారన్నారు. సౌభాగ్యలక్ష్మిలో ప్రతి ఆడబిడ్డకు రూ.3 వేలు ఇస్తామ‌ని అని కేటీఆర్‌ అన్నారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111జీవోను ఎత్తేశామని కేటీఆర్ అన్నారు. 111 జీవోలో న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పనిచేసే నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని.. కేసీఆర్‌కు అత్యంత సన్నిత ఎమ్మెల్యేల్లో కాలె యాదయ్య ఒకరని చెప్పారు. అందుకే ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement