Thursday, May 2, 2024

BJP – ఏం జరుగుతుంది … ఆ నలుగురికీ బీ-ఫామ్‌లు ఇవ్వలా

హైదరాబాద్ – – బీజేపీ నలుగురు అభ్యర్థులకు బీ-ఫామ్‌లు పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ, బూర నర్సయ్యగౌడ్ తదితరులు వివిధ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కానీ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులకు బీ ఫామ్స్ నిలిపివేసింది. ఇందులో హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి మాధవీలత కూడా ఉన్నారు.

హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేసి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమెకు బీ ఫామ్ నిలిపివేశారు. హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి నుంచి ప్రకటించిన గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డిలకు బీ ఫామ్‌ను నిలిపివేసింది. ఎందుకు పెండింగ్‌లో పెట్టింది తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement