Monday, April 29, 2024

NZB: పసుపు బోర్డు ప్రకటనతో… బీజేపీ నాయకుల సంబురాలు…

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 2 (ప్రభ న్యూస్): పసుపు బోర్డు ప్రకటనతో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య సంబరాల్లో పాల్గొన్నారు. పసుపు రైతులు, బీజేపీ నేతలు సంబరాల్లో మునిగి తేలారు. బోర్డు తీసుకువచ్చిన ఎంపీ అరవింద్ కు పసుపుతో తిలకందిద్దారు మహిళా నేతలు. పసుపు రైతులు సన్మానించారు.


విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యాలయం వద్ద ఎంతో ఉత్సాహంగా బీజేపీ నాయకులు సంబరాల్లో పాల్గొన్నారు. పసుపు బోర్డు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కృషి ఫలించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటనతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా పసుపు పంటకు ఆశించిన మద్దతు ధర లేక సరైన దిగుబడి రాక ప్రత్యా మ్నాయం వైపు చూస్తున్న తరుణంలో పసుపు బోర్డు కొత్త ఆశలు చిగిరింప చేసింది. నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement