Friday, May 3, 2024

BJP – ఇటలీ బీజాలున్న కాంగ్రెస్​ను తరిమేద్దాం – కేసీఆర్​ను బొంద పెడుదాం..బండి సంజయ్

కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీవి ఇటలీ బీజాలు అని కరీంనగర్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత సమ్మేళనంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఏ ఏ హ్యూమ్ అనే బ్రిటిష్ వ్యక్తి స్థాపించారన్నారు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అన్నారు. స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ లోని గాంధీ పేరును తగిలించుకొని ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు ఆయన ఆత్మను క్షోభకు గురి చేస్తున్నాయన్నారు. హిందూ ధర్మం కోసం పోరాడే భారతీయ జనతా పార్టీని బ్రిటిష్ పార్టీ అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు. అసలైన దేశభక్తుడు అటల్ బిహారీ వాజ్​పేయి బీజేపీని ప్రారంభించారని, అలాంటి చరిత్ర ఉన్న పార్టీ తమది అన్నారు.

పేదల సంక్షేమానికి పెద్దపీట
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. చాయ్ వాలా ప్రధాని అయ్యాడు కాబట్టే పేదల కష్టాలు తెలిసి వారి సంక్షేమానికి పెద్ద పీట వేశాడన్నారు. మే 13న జరిగే లోక్​సభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నిక అవుతారన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియదు
కాంగ్రెస్ అభ్యర్థి వేలిచాలా రాజేందర్రావు నియోజకవర్గ ప్రజలకు తెలియదని, వందల కోట్లు తీసుకువచ్చి ఎన్నికల్లో నిరుపేద బిడ్డనైనా తనను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారని మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. జూన్ 4న కేసీఆర్ ను బొంద పెట్టుడే అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టేలా తీర్పును ఇవ్వాలన్నారు. వందల కోట్లు ఉన్న వ్యక్తులకు వందల కేసులు ఉన్న నిరుపేదకు పోటీ జరుగుతుందని, ప్రజలు నిరుపేద బిడ్డనైన తనకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉండే సేవ చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement