Saturday, April 27, 2024

తేనెటీగల దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి

కేశంపేట: స్నేహితులతో కలసి సరదాగా గడపడానికి వెళ్లిన ఓ యువకుడిపై తేనెటీగలు అటాక్ చేశాయి. దీంతో అత‌డిని ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట‌ మండలం కోనాయిపల్లి గ్రామంలో జ‌రిగింది. సోప్పరి సందీప్ (30) దోస్తుల‌తో క‌లిసి సరదాగా గడపడానికి మంగళవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని మర్రి చెట్టు కిందికి వెళ్లారు.

అదే సమయంలో ఈదురు గాలులు రావడంతో ఒక్క‌సారిగా తేనెటీగలు వారిపైన దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన సందీప్ ను శంషాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చ‌నిపోయిన‌ట్టు గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement