Sunday, April 28, 2024

రేపు వికారాబాద్ జిల్లాలో విజయ సంకల్ప యాత్ర… పాల్గొననున్న బండి సంజయ్

వికారాబాద్, ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్): భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లాకు రేపు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విచ్చేస్తున్నట్టు వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు కే మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని తాండూర్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారానన్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో పాటు చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొంటారని అనంతరం దారుల్లో నిర్వహించే బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగిస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో బండి సంజయ్ విశ్వేశ్వర్ రెడ్డిలు పాల్గొంటారని తెలిపారు బిజెపి అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement