Sunday, May 5, 2024

Breaking: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్

భారతీయ జనతా పార్టీ అధిష్టానం బండి సంజయ్ ను జాతీయ నాయకత్వంలో తీసుకుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్ ను అధిష్టానం నియమించింది.బండి సంజయ్ కి కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆయన అనుచరులు భావించారు. అయితే , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమించారు. సంజయ్ సేవలు పార్టీ కి అవసరమని గుర్తించిన అధిష్టానం ఆయన్ను కీలక పదవిలో నియమించింది. సంజయ్ ని ఒకటి రెండు రాష్ట్రాలకు ఇంచార్జి గా నియమించే అవకాశం ఉంది. సంజయ్ పార్టీ లో కరీంనగర్ నగర అధ్యక్షుని స్థాయి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం నుండి మురళీధర్ రావు తరువాత ఈ పదవి అందుకున్న వ్యక్తి బండి సంజయ్ అని చెప్పవచ్చు

అలాగే ఏపీ నేత సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement