Monday, April 29, 2024

TS : కాంగ్రెస్ లోకి బల్దియా డిప్యూటీ మేయర్…

ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి ఆమె భర్త ట్రేడ్ యూనియన్ నాయకులు శోభన్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి చేరనున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు పాల్గొంటారు. కాగా బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేదంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న కేసీఆర్ కు లేఖ పంపారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement