Thursday, May 2, 2024

TS : ప్రజాహిత యాత్రపై దాడి….భారీగా మోహరించిన పోలీసులు..

బీజేపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాహిత యాత్ర‌పై కాంగ్రెస్ నాయ‌కులు దాడికిపాల్ప‌డ్డాయి. కర్రలు పట్టుకుని ప్రజాహిత యాత్రను కాంగ్రెస్ నాయ‌కులు అడ్డుకునేందుకు వచ్చాయి. దీంతో అక్క‌డ ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా పోలీసులు మోహ‌రించారు.
కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా పోలీసులు నిలువరించారు. కాంగ్రెస్ తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -

కాంగ్రెస్ నేతలు కర్రలతో వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీ నేతల మండిప‌డ్డారు. బీజేపీ నేతలను సైతం ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బీజేపీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, హుస్నాబాద్ బీజేపీ అభ్యర్ధి బొమ్మ శ్రీరాం చక్రవర్తిని ప్రజాహిత యాత్ర క్యాంపుకు వెళ్లకుండా నిలువ‌రించారు. పార్టీ నాయ‌కుల‌ను క‌లిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవ‌డమేంట‌ని బొమ్మ శ్రీ‌రాం పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈనేప‌థ్యంలో కాంగ్రెస్ నేతల తీరుపై బండి సంజయ్ మండిప‌డ్డారు. ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement