Saturday, September 21, 2024

WGL | న్యూస్​ కవరేజీకి వెళ్లిన విలేకరిపై దాడి.. నిందితులను అరెస్టు చేయాలని ధర్నా, రాస్తారోకో

భీమదేవరపల్లి (ప్రభ న్యూస్): హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ఓ పత్రికా విలేకరిపై కొంద‌రు యువ‌కులు దాడికి తెగ‌బ‌డ్డారు. ముల్క‌నూరులోని అంబేద్క‌ర్ విగ్ర‌హం వద్ద నినాదాలు చేస్తుండగా.. క‌వ‌రేజీకి వెళ్లిన స‌ద‌రు విలేక‌రిపై యువ‌కులు ప‌రుష ప‌ద‌జాలంతో దూషిస్తూ దాడి చేశారు. కాగా, ఈ విషయాన్ని అక్కడి మీడియా రిపోర్టర్లంతా సీరియస్​గా తీసుకున్నారు. విలేక‌రిపై దాడికి పాల్ప‌డిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భీమదేవరపల్లి మండల వర్కింగ్ జర్నలిస్టులు సోమ‌వారం రాత్రి ముల్క‌నూరు ర‌హ‌దారిపై ధర్నా, రాస్తారోకో నిర్వ‌హించారు. అనంత‌రం స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement