Friday, May 17, 2024

హైదరాబాద్​లో దారుణం.. బాలికపై తండ్రీకొడుకుల అఘాయిత్యం

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. తండ్రీకుమారులిద్ద‌రూ క్రూర‌మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. అన్నెంపుణ్యం ఎరుగ‌ని ఓ బాలిక‌పై విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ శివార్ల‌లోని కొంప‌ల్లిలో వెలుగు చూసింది. శివ‌కుమార్(45), కుమారుడు శ్యామ‌ల్(19) అనే ఇద్ద‌రు వ్య‌క్తులు కొంప‌ల్లిలో నివాస‌ముంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి ప‌క్క‌నే ఓ బాలిక ఉంటోంది. ఆమెకు ఫోన్ ఇస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంత‌రం బాలిక‌పై అత్యాచారం చేశారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తామ‌ని బాలిక‌ను హెచ్చ‌రించారు.

అయితే గ‌త రెండు మూడు రోజుల బాలిక ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా వ‌చ్చింది. ఏమైంద‌ని త‌ల్లి గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌గా, జ‌రిగిన ఘోరాన్ని వివ‌రించింది. దీంతో బాధితురాలి త‌ల్లి పేట్‌బ‌షీరాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే తండ్రీకుమారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. చికిత్స నిమిత్తం బాలిక‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని బాలిక కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement