Sunday, April 28, 2024

TS: మంత్రి సీతక్కని కలిసిన ఆత్రం సుగుణ..

ఉట్నూర్, మార్చి 20 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కను ఇవాళ ఉదయం మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సత్తు మల్లేష్ తో కలిసి ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న ఆత్రం సుగుణ కలిశారు.

ఆమె మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. పలు విషయాలపై సుగుణతో పాటు ఎమ్మెల్యే బొజ్జుపటేల్ మంత్రితో చర్చించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement