Friday, May 17, 2024

తెలంగాణలో భక్షకులుగా.. రక్షకులు.. : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో రక్షకులు భక్షకులుగా మారారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం ఫామ్ హౌజ్ లో ఉంటే.. ఆయన కుమారుడు ట్విట్టర్ లో ఉన్నారన్నారు. తెలంగాణలో ఒక భయానక వాతావరణం నెలకొందన్నారు. వీటిపై ఒక్క మాట మాట్లాడేందుకు సీఎంకు సమయం దొరకడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించలేకపోతోందన్నారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఫామ్ హౌజే అధికార కేంద్రంగా మారిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement