Sunday, April 28, 2024

ADB: మోసపూరిత కేసీఆర్ కు ఓటుతో సమాధానమివ్వండి.. తీన్మార్ మల్లన్న

చెన్నూర్ ఆంధ్రప్రభ: మోసపూరిత వాగ్దానాల పదేళ్ల కేసీఆర్ పాలనకు ఓటుతో సమాధానం ఇవ్వాలని తీన్మార్ మల్లన్న చెన్నూరు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ కేంద్రంలో తీన్మార్ మల్లన్న రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే బీఅర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నియోజకవర్గ వనరులను దోచుకుంటూ కోట్లు గడించి మరో నయీంలా తయారయ్యాడనీ ద్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా సాగుతుందని, రెండు రోజుల్లో జరిగే ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పుడు నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ వివేక్ అని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement