Wednesday, May 1, 2024

దశాబ్ది ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. పంట కొనుగోలుపై లేదా? : బీజేపీ నేత సంతోష్ రెడ్డి

తాంసి (ప్రభ న్యూస్) : దశాబ్ది ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ జొన్న పంట కొనుగోలుపై లేదా అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం తాంసి మండల కేంద్రం సమీపంలోని మార్క్ఫెడ్ ఎదుట రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన జొన్నలను గత వారం రోజుల నుండి గన్ని బ్యాగుల పేరిట, గోదాముల పేరిట, లారీల పేరిట కొనుగోలు నిలిపివేయడం విడ్డూర‌మని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తాంసి పోలీసులు రాస్తారోకోను అడ్డుకోగా మరో రెండు రోజుల్లో జొన్న కొనుగోలు ప్రారంభించకపోతే రైతులతో కలిసి రోడ్డు పై వంటావార్పు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముక్కెర సుభాష్, మండల ఉపాధ్యక్షులు సిరిగిరి మహేందర్, పెంట గంగాధర్, తుకారాం, సతీష్, స్వామి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement