Monday, April 29, 2024

ADB: అడవి ఒడిలో.. పల్లెనిద్ర చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ భోజ్జు

ఉట్నూర్, ఆగస్టు10 (ప్రభ న్యూస్) : ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్బంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ భోజ్జు పటేల్ బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలొని తేజపూర్ ఆదివాసీ గూడెంలో పల్లెనిద్ర చేసారు. పల్లె నిద్రకు గూడానికి వెళ్లిన వెడ్మ భోజ్జు పటేల్ ను అడవి బిడ్డలు సాదరంగా ఆహ్వానించారు. గూడెం వాసులతో సమావేశమైన వెడ్మ భోజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో గిరిజనుల అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలను వివరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షలు రుణ మాఫీ, పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.15వేలు, రైతుకూలీలకు రూ.12వేలు అందిస్తామన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కరపత్రాలు ఇంటింటికి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement