Monday, April 29, 2024

ADB: గులాబీ గూటికి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్…

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కమలం గూటిని వీడి మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీ పార్టీలో చేరారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ ఎన్నికల ప్రచారంలో తిరిగిన జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఇవాళ‌ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు మాజీ సర్పంచులు, కొమరం భీమ్ మనవడు కొమరం సోనేరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement