Friday, May 3, 2024

తెలంగాణలో పలువురు ఎ సి పి లు బదిలీ

నిజామాబాద్ జులై 27(ప్రభ న్యూస్,) రాష్ట్రం లో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ పోలీస్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ ఏ సి పి గా పని చేస్తున్న కిరణ్ కుమార్ ను పోలీస్ అధికారులు ప్రధాన కార్యలయం లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. బోధన్ లో అయన రెండేళ్ళ అధికార బాధ్యతలు పూర్తి కాక ముందే బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న విజయ సారధి ని బోధన్ ఎ సి పి గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ట్రాన్స్ కో లో పనిచేస్తున్న వాసం సురేందర్ ను నల్గొండ జిల్లాకు బదిలీ చేశారు. మధు మోహన్ రెడ్డి, సి. అంజయ్యలను హైదరాబాద్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వెంటనే కేటాయించిన ప్రాంతం లో విధులలో చేరాలని డి జి పి కార్యలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement