Friday, May 3, 2024

Accident … క‌విత మ‌ర‌ణానికి సిఐ కుమారుడే బాధ్యుడంటూ కాజీపేట పిఎస్ ఎదుట బంధువుల బైఠాయింపు…

హనుమకొండలో దారుణం జరిగింది. అతివేగంతో కారు ఢీ కొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. ఫాతిమానగర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం దగ్గర జరిగిందీ ఘటన. నిన్న ఓటు వేసి వెళుతున్న కవిత ను అతి వేగంగా వెళ్తూ కారు ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన మహిళ స్పాట్‌లోనే చనిపోయింది.యాక్సిడెంట్‌ చేసిన కారు.. ఎక్సైజ్ సీఐ శరత్కి చెందినదిగా గుర్తించారు. సీఐ కుమారుడు వంశీభార్గవ్ అతి వేగంతో కారు నడిపి యాక్సిడెంట్ చేశాడ‌ని మృతురాలి బంధుగ‌ణం ఆరోపిస్తున్న‌ది .

ఈ ఘటనను పోలీసులు పట్టించుకోకపోవడంతో మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. కాజీపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. అక్క‌డే భైఠాయించారు.. కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసేంత‌వ‌ర‌కూ క‌దిలేదిలేద‌ని తేల్చి చెప్పారు.. దీంతో పోలీస్ ఉన్న‌తాధికారులు యాక్సిడెంట్ వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు..ప్ర‌మాదానికి వంశీ కార‌ణ‌మైతే కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేస్తామ‌ని బాధితుల‌కు భ‌రోసా ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement