Wednesday, May 15, 2024

Accident – అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా – ఒకరి మృతి

చింతపల్లి నవంబర్ 25 (ప్రభ న్యూస్) నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై చింతపల్లి మండల కేంద్రంలో సాయిబాబా దేవాలయం సమీపంలో ఉదయం శనివారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదం లో ఒక మహిళ మృతి చెందింది పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల వివరాలు ప్రకారం చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో హైదరాబాదు నుండి వినుకొండ వైపు వెళ్తున్న ఓ – బస్సు హైదరాబాద్ లో తమ బంధువుల పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది.

బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. అందులో చప్పిడి భారతమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో బస్సులోని క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement