Sunday, April 28, 2024

ADB: పీఎస్ లో ఏసీబీ దాడులు… లంచంతో పట్టుబడిన ఎస్ఐ రాజ్యలక్ష్మి

ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 15 (ప్రభ న్యూస్) : కుమ‌రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో రూ. 25వేలు లంచం తీసుకుంటూ మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి ఏసీబీ వలలో చిక్కడం కలకలం రేపింది. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా గ్రామం వద్ద మార్చ్ 31న మంచిర్యాల నుండి ఆసిఫాబాద్ వస్తున్న కారు, మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి.

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ గ్రామానికి చెందిన యాహియా ఖాన్ పైన కేసు నమోదు కాగా, ఆయన కారుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి, ఆయన వాహనం రిలీజ్ చేయడానికి ఎస్సై రాజ్యలక్ష్మి రూ.40వేలు డిమాండ్ చేశారని, పోలీస్ స్టేషన్ లో సదరు బాధితుడు సోమవారం రూ.25 వేలు ఇస్తుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సై రాజ్యలక్ష్మిని కరీంనగర్ స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement