Sunday, April 28, 2024

TS: బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. ఇద్దరు మృతి

ప్రైవేటు బ‌స్సు బైక్ ను ఢీకొన‌డంతో ఇద్ద‌రు కార్మికులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో జరిగింది. ఇవాళ‌ ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం స్టేజి వద్ద మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో అదుపుతప్పిన బస్సు.. బైకును ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement