Friday, May 17, 2024

లోక్‌ అదాలత్‌లో 713 కేసుల పరిష్కారం, బాధితులకు రూ.28 కోట్ల పరిహారం: సిటీ కోర్టు చీఫ్‌ జడ్జి రేణుక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశ వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం సిటీ సివిల్‌ కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 713 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఐటీ సివిల్‌ కోర్టు చైర్‌పర్సన్‌ చీఫ్‌ జడ్పి వై. రేణుక తెలిపారు.

ఈ సందర్భంగా మోటార్‌ యాక్సిడెంట్‌ ప్రమాద బాధితులకు లోక్‌ అదాలత్‌ ద్వారా హైదరాబాద్‌లో రూ. 26.46 కోట్ల పరిహారం అందించేలా రాజీ మార్గం ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు. 222 ఫ్రీ-లిటిగేషన్‌ కేసుల ద్వారా బ్యాంకులకు ఇతర వ్యక్తులకు రూ.2.9 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించేలా పరిష్కారం చేసినట్టు సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జీ రేణుక చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement