Sunday, May 5, 2024

NZB | వికటించిన మధ్యాహ్నం భోజనం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత..

నిజామాబాద్ సిటీ, 🙁 ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఇవ్వాల (గురువారం) పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసినా అనంతరం తీవ్ర అస్వస్థకు గురయ్యారు.

వెంటనే విద్యార్థులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. ఇందులో సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement