Wednesday, May 1, 2024

జ‌ల‌పాతం చూడ్డానికి వెళ్లిన యువ‌కులు.. రాపూరు అటవీ ప్రాంతంలో ఒక‌రి అదృశ్యం..

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని రాపూరు అట‌వీ ప్రాంతంలో ఓ యువ‌కుడు త‌ప్పిపోయిన ఘ‌ట‌న ఆదివారం రాత్రి జ‌రిగింది. సిద్దాలయ్య కోన జలపాతం చూడ్డానికి గూడూరు చౌటపాలెంకు చెందిన ఐదుగురు యువకులు ఆదివారం సాయంత్రం వెళ్లారు. జలపాతంలో ఆడుకుని తిరుగుప్ర‌యాణ‌మ‌య్యారు. అయితే అటవీ ప్రాంతం.. పైగా చీకటి కావడంతో ఐదుగురు స్నేహితులు మెల్ల‌గా వ‌స్తున్నారు.

కానీ, జలపాతం నుండి కొద్దిదూరం వచ్చిన తర్వాత‌ వెనుకబడిన కిషోర్ క‌నిపించ‌క‌పోవ‌డంతో మిగిలిన న‌లుగురు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వారు ఆ ప్రాంతమంతా గాలించారు. అయినా కిషోర్ జాడ కనిపించక లేదు. దీంతో స‌మీపంలోని రాపూరు పోలీసులకు రాత్రి 11 గంటల ప్రాంతంలో సమాచారం అందించారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులతో కలసి కిషోర్ ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement